Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మేలు: ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి

IMG 20250623 190019

Oplus_0

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ పథకం కింద చేపట్టనున్న గృహ నిర్మాణాల కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పంతో నిరుపేదలకు గృహ కల నెరవేర్చడం జరుగుతోందన్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటిని పొందడం ప్రతి కుటుంబానికి మేలు చేస్తుందన్నారు. పథకం కింద ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతునిస్తూ, ప్రతి అర్హుడు ఇంటిని నిర్మించుకునేలా సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సంతోషి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు విజయ్ కుమార్, ఆగం రాజు, స్వప్న, నీరుడి నర్సింలు, నాయకులు ప్రభు, వెంకటేష్, నీరుడి మల్లేష్, లబ్ధిదారులు శంకర్ నాయక్, అల్లం ఊర్మిళ, కమలమ్మ, మన్నే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version