Site icon PRASHNA AYUDHAM

పుట్టపర్తి ప్రాంత ప్రజల చిరకాల కోరిక……..

ప్రజల
Headlines:
  1. “195 చెరువుల ప్రాజెక్టు కోసం గట్టిగా కోరిన పల్లె సింధూర రెడ్డి”
  2. “పుట్టపర్తి ప్రజల చిరకాల కోరికను శాసనసభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే”
  3. “రాయలసీమ కరువు నివారణలో కీలకమైన 195 చెరువుల ప్రాజెక్టు”
  4. “నియోజకవర్గ అభివృద్ధికి తలమానికంగా మారే పుట్టపర్తి ప్రాజెక్టు”
  5. “10 వేల ఎకరాలకు సాగు నీటిని అందించే ప్రాజెక్టుపై పల్లె సింధూర రెడ్డి అభ్యర్థన
*195 చెరువులకు నీళ్లు ఇవ్వడమే*

 *ఈప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గానికే తలమానికం* 

 *ఈ ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటికీ పూర్తి చేస్తారో నిర్దిష్టమైన గడువు ప్రకటించండి* 

 *అసెంబ్లీలో గట్టిగా ప్రభుత్వాన్ని కోరిన పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి* 

సత్య సాయి జిల్లాలో అత్యంత వెనుకబడిన పుట్టపర్తి నియోజకవర్గంలో ని 195 చెరువులకు నీళ్లు ఇవ్వడమే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలోని శాసనసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ,నియోజకవర్గంలోని 195 చెరువులకు రాయలసీమ కరువు నివారణ ఎత్తిపోతల పథకం ద్వారా త్వరగా పనులు చేపట్టే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా తగిన నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాలని విన్నవించారు. ఇది అమలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఈ ప్రాంత ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటారని పేర్కొన్నారు. ముఖ్యంగా

దక్షిణ భారతదేశంలోనే సత్యసాయి జిల్లా చాల వెనుకబడిన ప్రాంతమని,ఈ 33 ఏళ్ల చరిత్రలో సుమారు 19 సార్లు ఈ ప్రాంతంలో కరువు వచ్చిందనీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయనీ ఎమ్మెల్యే సభ లో వివరాలు వెల్లడించారు.ఇలాంటి ప్రాంతమైన పుట్టపర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు , అప్పటి రాష్ట్ర మంత్రి పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యేక చొరవతో 2018లో జీవో , ఆర్టి నెంబర్ 201 పుట్టపర్తి నియోజకవర్గం లోని 6 మండలాలకు హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు అందించే బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వం నుంచి సర్వే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం 3.34కోట్లు మంజూరు చేశారు అయితే ఎన్నికల రావడంతో ఆ పథకం అలాగే నిలిచిపోయింది .2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐదు 195 చెరువులకు నియోజకవర్గంలో నీళ్లు పారించడమే మా కర్తవ్యం అని ప్రగల్బలాలు పలికి ఈ ప్రాంత ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో గెలిచారే కానీ ఐదేళ్ల వైసిపి పాలనలో ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని గుర్తు చేశారు. అయితే 2021 ఏడాదిలో జీవో 36 కింద రూ. 864 కోట్లు రాయలసీమ కరువు నివారణ ఎత్తి పోతలపథకం కింద అప్పటి వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది అయితే ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. పుట్టపర్తి నియోజకవర్గం లో 195 చెరువులకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో వరం అన్నారు .ఇది పుట్టర్తి నియోజవర్గ ప్రజల చిరకాల కోరిక అని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజవర్గంలో సుమారు 10వేల ఎకరాలు సాగులోకి వచ్చి సుమారు 2 లక్షల 34 వేల మందికి త్రాగునీరు సౌలభ్యం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే భవిష్యత్ లో పుట్టపర్తి ప్రాంతం మరో కోస్తాగా మారుతుందన్నారు.ఈ ప్రాజెక్టు పనులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో ,ఎప్పటికీ పూర్తి చేస్తారో నిర్దిష్ట గడువును తెలపాలని రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం ద్వారా సంబంధిత నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

Exit mobile version