పీజేఆర్ పేరును ఫ్లై ఓవర్ కు పెట్టడం అభినందనీయం
ఈ ప్రాంత అభివృద్ధికి పీజేఆర్ ఎనలేని కృషి చేశారు
నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు
కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి
ప్రశ్న ఆయుధం జూన్ 28: కూకట్పల్లి ప్రతినిధి
హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తూనే పేదల నాయకునిగా పేరు అందిన సీఎల్పీ మాజీ నేత పి జనార్దన్ రెడ్డి పేరును కొండాపూర్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ కు నామకరణం చేయడం అభినందనీయమని కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. పీజేఆర్ పేరున ఫ్లైఓవర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పేదల నాయకునిగా ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమస్యలపై గళం విప్పిన నేత పీజేఆర్ అని కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ అన్నారు. నా రాజకీయ గురువు, ఒకప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర నేతగా నేతగా పిజెఆర్ ఎదిగారని కొనియాడారు.ఆయన సేవలకు గుర్తింపుగా గచ్చిబౌలిలోని ఓ ఆర్ ఆర్ ఫ్లైఓవర్కు “పీ.జె.ఆర్ ఫ్లైఓవర్”గా నామకరణం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి, కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే మున్ముందు మరిన్ని గుర్తింపులు అందించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అని స్పష్టం చేశారు. పీ.జె.ఆర్ మన మధ్య లేకపోయినా, ఆయన త్యాగాలు, సేవలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా వెలుగుతూనే ఉంటాయని కూకట్ పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు.