Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

IMG 20241016 WA0443

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ అవసరం లేదు

-పాఠశాలకు ఏమైనా అవసరాలు ఉంటే నా దృష్టికి తీసుకు రండి

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ప్రశ్నాయుధం న్యూస్, అక్టోబర్ 16, కామారెడ్డి :

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బిక్నూర్, భస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలను బుధవారం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో, సిబ్బందితో, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనీ, మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదనీ , పాఠశాలకు ఏమైనా అవసరాలు ఉంటే నా దృష్టికి తీసుకు రావాలని అన్నారు. పాఠశాలలోని రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ మంచిగా చదివి ఉన్నత స్థాయిలో ఉండి తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

Exit mobile version