రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలి..

రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను చేస్తున్న నాందేడ్ పట్టణ ఎన్నికల ఇంచార్జ్ షబ్బీర్ అలీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.గాంధీ కుటుంబం మోదీ కుటుంబం మధ్య జరుగుతున్న సమరం
మాది అందరిని ఏకం చేసి ప్రేమ నీ పంచె నినాదం వారిది రెచ్చగొట్టి విడదీసి విద్వేషాన్ని పెంచే నినాదం మహారాష్ట్ర రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఓడించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. బిజెపి అధికారంలో లేని ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం దురదృష్టకరమన్నారు.
ప్రభుత్వాలను పడగొట్టే ఆలోచన అభివృద్ధి చేయడంలో లేదన్నారు
చార్ సౌ పార్ అన్నారు చేతికిల పడ్డారు పొత్తులతో ప్రభుత్వం నడిపిస్తున్నారు.మహారాష్ట్ర లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.

Join WhatsApp

Join Now