యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

*యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు*

*జమ్మికుంట జూన్ 19 ప్రశ్న ఆయుధం*

ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గురువారం రోజున యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం జమ్మికుంట పట్టణ మండల యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలిపారు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షుడుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే నినాదంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని పేర్కొన్నారు

భవిత వికలాంగుల పాఠశాలలో పర్లపెల్లి నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్కులు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment