రాయికోడ్ పోలీస్ స్టేషన్, హద్నూర్ సర్కిల్ కార్యాలయాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): వార్షిక తనిఖీలలో భాగంగా రాయికోడ్ పోలీసు స్టేషన్ ను శనివారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. రాయికోడ్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్ ను తనిఖీ చేస్తూ తగు సూచనలు చేశారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇన్వెస్టిగేషన్ లో సందేహాలుంటే.. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓకు సూచనలు చేశారు. నేరాలు జరిగిన ప్రాంతాలను స్టేషన్ పార్ట్-II మ్యాప్ లో నమోదు చేయాలని, ఆస్థి సంబంధిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను “క్రైమ్ హాట్ స్పాట్స్” గా గుర్తించి, నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు. స్టేషన్ పరిదిలో గల కేడి, సస్పెక్ట్, రౌడీ షీటర్ లను చెక్ చేస్తూ వారి కదలికలపై నిఘా ఉంచి, తరుచూ తనిఖీ చేయాలని అన్నారు. ప్రభుత్వ నిషేదిత గంజాయి సాగు, రవాణ, ప్రభుత్వ పంపిణీ బియ్యం (పి.డి.ఎస్ రైస్) అక్రమ రవాణా జరగకుండా ముమ్మర వాహనాల తనిఖీ నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారి ఆయా గ్రామలపై పూర్తి అవగాహన కలిగి, ముందస్తూ సమాచారాన్ని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని అన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థలలో, పని ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, డైల్ -100 కాల్స్ కు బ్ల్యూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది త్వరితగతిన స్పందించి, నేరాస్థలానికి చేరుకోవాలని, త్వరగా ఘటన స్థలానికి చేరుకోవడం వలన నేరం తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. స్వచ్ఛంధంగా సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేయాలని ఎస్.హెచ్.ఓకు సూచించారు. స్టేషన్ రికార్డుల మెయింటనెన్స్, సిబ్బంది పని తీరు బాగుందని, ఎస్.హెచ్.ఓ చైతన్య కిరణ్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ తనిఖీ లలో భాగంగా ఎస్పీ వెంబడి జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, ఇన్స్పెక్టర్ హన్మంతు లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment