Site icon PRASHNA AYUDHAM

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్..

తెలుగు రాష్ట్రాలకు మళ్లీ రెయిన్ అలర్ట్..!!

ద్రోణి వీటి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోు తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో చూడండి..తెలంగాణలో సోమవారం కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు.. మరి కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు తిరోగమించటం ప్రారంభమైందని..వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Exit mobile version