జర్నలిస్ట్ విలువలతో కూడిన రాజ్ న్యూస్ అంచలంచెలుగా ఎదగాలి : కప్పర ప్రసాద్ రావు
తెలంగాణ ప్రజలకు సుపరిచితంగాఉన్న రాజ్ న్యూస్ పున ప్రారంభ పూజా కార్యక్రమంలో సీఈఓ లక్ష్మీ రావు తో కలిసి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పల ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ రావు కృషి పట్టుదల ఆమెను ఈ స్థాయి తీసుకువచ్చిందని రాజ్ ను సీఈఓ గా కొత్త బాధ్యతలు చేపట్టిన ఆమె మరింత పై స్థాయికి పోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలక ఆకాంక్ష కు అనుగుణంగా ప్రజల పక్షాన ఉంటూ రాజ్ న్యూస్ యాజమాన్యం జర్నలిస్టులు గతంలో కంటే మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను చూపెడుతూ నిష్పక్షపాతంగా జర్నలిజం విలువలతో కూడిన వార్తలను ప్రసారం చేయాలన్నారు,
ఎన్నో ఏళ్లుగా రాజ్ న్యూస్ కు తెలంగాణకు సంబంధం ఉందని ఉద్యమ సమయంలో రాజీనాస్ ఒక వెలుగు వెలిగిందని నాటి స్ఫూర్తిని నేడు కొనసాగించాలని నేడు తెలంగాణ అభివృద్ధి ప్రజల కష్టసుఖాలు బయటకు తీస్తూ ప్రేక్షకుల మనసులను చూరగొనాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి తో పాటు పలువురు పాల్గొన్నారు