రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలీ  – జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలీ

– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం అధికారులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం నకు సంబంధించిన 41547 దరఖాస్తులను బ్యాంకులకు పరిశీలను పంపడం జరిగిందని, వాటిలో 15,515 దరఖాస్తులు బ్యాంకర్లు పరిశీలించినట్లు తెలిపారు. మిగతావి రెండు రోజుల్లో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు బ్యాంకుల నుండి సమాచారం త్వరగా తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, బి.సి.సంక్షేమ అధికారిణి స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, ఎల్.డి.ఏం. , తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment