Site icon PRASHNA AYUDHAM

రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు బ్యాంకు షూరిటీ లేకుండా నేరుగా రుణం మంజూరు చేయాలి

IMG 20250317 WA0032

ఎస్సీ కార్పొరేషన్ మధ్య దళారుల ప్రమేయం లేకుండా చూడాలని బొమ్మెర శ్రీనివాస్ డిమాండ్ చేశారు

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చ్ 22 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగులకు,

నిరుపేదలకు చేయూత ఇవ్వాలని అన్నారు. షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం సింగరేణి ఏరియా హాస్పిటల్ సెంటర్ నుండి శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజివ్ యువ వికాస పథకం నిరుద్యోగులను,నిరుపేదలను ఆదరించే విధంగా ఉండాలని కోరారు.ఎటువంటి బ్యాంకు షూరిటీ లేకుండా లబ్ధిదారులకు నేరుగా రుణం మంజూరి చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేయాలని కోరారు.ఎస్సీ కార్పొరేషన్ మధ్య దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రోడ్డు వెంట చెప్పుల రిపేరు చేసుకొని కుటుంబ పోషణ గడిపే కుటుంబాలకు ఇచ్చే యూనిట్స్ మొదటి ప్రాధాన్యత కల్పించి ఆదుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను మధ్య దళారుల వల్ల లబ్ధిదారులు నష్టపోకుండా అధికారులు ముందు చూపుతో చర్యలు చేపట్టాలని కోరారు.

Exit mobile version