మహిషాసుర మర్దిని అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి – తెదేపా ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ..
దసరా ఉత్సవాల్లో భాగంగా ఉయ్యూరు మండలం, కాటురు గ్రామంలో నేరుసు పోతురాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తదుపరి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించినారు.ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహిషాసుర మర్దిని అమ్మవారి కరుణా కటాక్షాలతో ఎటువంటి విపత్తులు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు గారి విజనరీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని, అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వేమూరి శ్రీనివాసరావు, కాటూరు సర్పంచ్ కొడాలి రవి,గ్రామ టీడీపి అధ్యక్షులు వెంకట నారాయణ,గుర్రం చంద్రశేఖర్,మేక సుందరయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు కోడె హరీష్ తదితరులు పాల్గొన్నారు .