బస్తీ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ.
నిజామాబాద్ జనవరి 15
బస్తీ దవాఖానాలలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ ఆదేశించారు.నిజామాబాద్ జిల్లాలోని ఖానాపూర్, నాగారం బస్తీదావాఖానా లను బుధవారం జిల్లా వైద్యాధిక శాఖ అధికారిని రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని , ఇతర వైద్యసేవలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ ప్రతి ఆశ కార్యకర్త డ్యూ లిస్టును మెయింటైన్ చేస్తూ ఒకరోజు ముందే టీకాలు ఎవరికి ఇవ్వాలో వారిని బస్తీ దావా ఖానాలకు వచ్చేలా చూడాలన్నారు. వ్యాక్సిన్ క్యారియర్ ఐస్ బాక్సులో కూలిoగ్ ఉండేలా చూడాలన్నారు. బస్తీ దావాఖా నాల్లో, ఆరోగ్య కేంద్రాల్లో శుభ్రతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటిస్తూ ,ప్రతిరోజు ఓపిని చూడాలని, లీవ్స్ రిజిస్టర్ మైంటైన్ చేస్తూ, లీవ్స్ ను డిప్యూటీ డిఎంహెచ్వోల అనుమతి తీసుకోవాలని, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు వారి స్థానంలో ఇతరులను వారికి బదులు నియమించాలని కోరారు. ఖానాపూర్ బస్తీ దావాఖాన స్థానిక ముదక్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి, నాగారం బస్తీ దావాఖాన స్థానిక పట్టణా ఆరోగ్య కేంద్రం సీతారాం నగర్ కాలనీ నుండి సరిపడా మందులను తీసుకొవలన్నారు.రికార్డులు మెయింటైన్ చేయాలనీ, క్షేత్రస్థాయిలో గృహ సందర్శన చేసి వ్యాధిగ్రస్తులను బస్తీ దావాఖానాకు తరలించేలా , ఏఎన్ఎం, ఆశలు చూడాలని కోరారు. ఈ ఆకస్మిక తనిఖీలో డిఎంహెచ్ఓ తో పాటు వైద్యాధికారులు , ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు.