Site icon PRASHNA AYUDHAM

రాజు మరణం పార్టీకి తీరని లోటు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

IMG 20241120 WA0173

నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 20:

నిజామాబాద్ నగరం 17వ డివిజన్ కార్పొరేటర్ మాయావర్ సవిత గారి భర్త రాజు అనారోగ్య కారణంతో చనిపోయారు కావున ఈ రోజు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్న రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికీ మనోధైర్యం చెప్పి, ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.

రాజు మరణం పార్టీకి తీరని లోటని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు గడ్డం రాజు, నాయకులు ప్రభాకర్, భాస్కర్, ఆనంద్, ఎస్ సి మోర్చా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version