అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ: గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి ఆగష్టు 8

కామారెడ్డి పట్టణంలోని తన నివాసంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి రక్షాబంధన్ సందర్భంగా బ్రహ్మకుమారి జయ, బ్రహ్మకుమారులు రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నా–చెల్లెళ్ల, అక్క–తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆడపడుచులు రాఖీ కట్టి “మీరు మాకు రక్ష – మేము మీకు రక్ష” అనే భావాన్ని ప్రతిబింబిస్తారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కామారెడ్డి మాజీ కౌన్సిలర్లు పంపరి లతా శ్రీనివాస్, పిడుగు మమతా సాయిబాబా, జూలూరి సుధాకర్, రంగా రమేష్, అనిల్, బ్రహ్మకుమారీలు గంగా, కవిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now