Site icon PRASHNA AYUDHAM

పాడెపై తమ్ముడికి రాఖీ… కన్నీటి బంధం

Screenshot 2025 08 09 20 45 36 72 6012fa4d4ddec268fc5c7112cbb265e7

పాడెపై తమ్ముడికి రాఖీ… కన్నీటి బంధం

ఖమ్మం జిల్లాలో హృదయ విదారక దృశ్యం

కూసుమంచి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఘటన

విషజ్వరంతో కన్నుమూసిన యువకుడు పందిరి అప్పిరెడ్డి (25)

పాడెపై చివరి ప్రయాణంలోనూ తమ్ముడి చేయి పట్టిన అక్క

కన్నీటి రాఖీతో ముద్దుబిడ్డను వీడ్కోలు

ఖమ్మం, ఆగస్టు 9:

రాఖీ పండుగ ఉదయం… పల్లె గల్లీల్లో ఆనంద కిలకిలలు. కానీ కూసుమంచి మండలం క్రిష్టాపురం గ్రామంలో మాత్రం దుఃఖం ముసురుకుంది. విష జ్వరంతో ముద్దు తమ్ముడు అప్పిరెడ్డి (25) కన్నుమూసాడు. పాడెపై చివరి ప్రయాణానికి సిద్ధం చేస్తుండగా అక్క రాఖీ తంతు తెచ్చి తమ్ముడి మణికట్టు చుట్టింది. కన్నీటి బిందువులు ఆ తంతుపై జారిపడ్డాయి. తమ్ముడి ప్రాణం వెళ్లిపోయినా, బంధం మాత్రం విడువలేదన్నట్లుగా ఆ దృశ్యం హృదయాలను ముక్కలుగా చేసింది.

Exit mobile version