ప్రజా ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో పాక్ దాడికి నిరసనగా ర్యాలి

పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండించిన ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎస్.కె దస్తగీర్

ప్రజా ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో పాక్ దాడికి నిరసనగా ర్యాలీ

పాకిస్తాన్ చర్యను తీవ్రంగా ఖండించిన ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎస్.కె దస్తగీర్

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సీ ఏప్రిల్ 27

కాశ్మీరులో పెహల్గాం ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన అభం శుభం తెలియని, ప్రజల మీద పైశాచిక దాడిని జరిపి 28 మంది ప్రాణాలను బలి తీసుకున్న పాకిస్తానీలకు సరైన బుద్ధి మన భారతదేశం చెపుతుందని, ఇటువంటి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా ప్రెస్ క్లబ్ చైర్మన్ ఎస్.కె దస్తగీర్ తీవ్రంగా ఖండించారు. దమ్మపేట మండల కేంద్రంలో ప్రజా ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిరసనగా తెలియజేశారు. పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెబుతుందని. భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దారా మల్లికార్జున రావు, బజ్జురి శ్రీనివాసరావు, కే ఉపేంద్ర, రాకేష్, ఎస్కే కాసిం, ఎండి, సున్నం శీను, సాలార్, శివ, నాగరాజు, రాజేశ్వరి, పరిటాల రాము, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now