Site icon PRASHNA AYUDHAM

ముఖ్యమంత్రికి లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రామదాస్ నాయక్

IMG 20250217 WA0409

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 17 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్ ను సోమవారం కొత్తగూడెం ఆయన నివాస గృహంలో కలవడం జరిగింది. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలు కోల్పోయిన రాజ్యాంగ హక్కులను,ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏజెన్సీ ప్రాంతా ఎస్సీ కులాలకు స్థానిక రిజర్వేషన్ కొనసాగింది.రాష్ట్ర ఏర్పడ్డాక ఎస్సీ రిజర్వేషన్ జనరల్ లో కలిపి అంధకారంలో నెట్టి వేశారని గోడు వెలిబుచ్చారు.స్పందించిన ఎమ్మెల్యే రామదాస్ నాయక్
ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థితిగతులను తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వడం జరిగింది.లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఉద్యమం తరఫున బొమ్మెర శ్రీనివాస్ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఉద్యమానికి సహకరించే ప్రజా ప్రతినిధులకు,మరియు అధికారులకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు కండే రాములు,సలిగంటి కొమరయ్య, వెంకటేశ్వర్లు,ఎనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version