*సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నదానానికి భాష్యం రామకృష్ణ రూ.44 లక్షల విరాళం*
*తిరుమల :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదానికి భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళంగా అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు విరాళం ఇచ్చారు. ఆన్లైన్ విధానంలో టీటీడీకి డబ్బులు చెల్లించి చంద్రబాబు పేరు మీద ఒక రోజు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు. వేంకటేశ్వర స్వామి దయతో చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని, రాష్ట్ర అభివృద్ది కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాలని రామకృష్ణ ఆకాక్షించారు.