అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు పూర్తి!

అధికార
Headlines in Telugu
  1. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడికి అధికార లాంఛనాలతో వీడ్కోలు
  2. నారా రోహిత్ భావోద్వేగపు క్షణాలు: ‘మా నాన్న మా కోసం ఎంతో చేశారు’
  3. నారా రామ్మూర్తి నాయుడి అంతిమ యాత్ర: నారావారిపల్లిలో కన్నీటి వీడ్కోలు
  4. రామ్మూర్తి నాయుడి పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి
  5. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా కుటుంబం కీలక ఘట్టం

అమరావతి:నవంబర్ 17

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహిం చారు. చంద్రబాబు నాయుడు తమ స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో తమ తల్లిదండ్రుల సమాధుల చెంతనే సోదరుడి అంత్యక్రియలు పూర్తిచేశారు.

రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో నారావారిపల్లికి తరలివ చ్చారు. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు, చంద్రబాబు సన్నిహితమిత్రులు, నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరయ్యారు. 

రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల సమయంలో తన తండ్రిని చివరిసారి చూసుకుంటూ నారా రోహిత్ వెక్కివెక్కి ఏడవ డం అందరినీ కంటతడి పెట్టించింది. మా నాన్న మా కోసం ఎంతో చేశారంటూ నారా రోహిత్ అభిప్రాయ పడ్డారు. ఎక్స్ ద్వారా నారా రోహిత్ విడుదల చేసిన ఓ ఎమోషనల్ నోట్ ఆయనకు తండ్రి మీదున్న ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. 

సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంతిమ నివాళి అర్పించారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివదేహాన్ని తీసుకొ చ్చారు. అనంతరం అక్కడికి వివిధ పార్టీల నేతలు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, తనయుడు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి వరుసగా నివాళి ఘటించారు. రామ్మూర్తి నాయుడి తనయుడు, ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్‌కు, ఆయన సోదరుడు నారా గిరీష్‌కు తాము అండగా ఉన్నామని చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పి ఓదార్చారు.

Join WhatsApp

Join Now