Site icon PRASHNA AYUDHAM

*ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ అవార్డు అందుకున్న రమేష్ యాదవ్*

IMG 20240813 182846

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): హైదరాబాదులోని హిమాయత్ నగర్ ఎలివేన్స్ కల్చర్ ఎలైట్ లో ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ అవార్డు అందుకున్నారు. వివిధ రంగాలలో అత్యుత్త ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, వారు అందించే శ్రీదేవి సినీ అవార్డు ప్రధానోత్సవంను సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల్ కంకోల్ గ్రామానికి చెందిన తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ ఎంపిక అయ్యారు. కాగా మంగళవారం హైదరాబాదులోని హిమాయత్ నగర్ ఎలివేన్స్ కల్చర్ ఎలైట్ లో ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ చైర్మన్ ఇంద్ర, సెక్రటరీ విల్సన్ లు రమేష్ యాదవ్ కు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలు, సామాజిక సేవలను గుర్తించి ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ వారు అవార్డు తనకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఇంద్ర ఆర్ట్ ఫౌండేషన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version