Site icon PRASHNA AYUDHAM

రేషన్ దుకాణదారులదే హవా…పేదల బియ్యంతో లక్షల్లో లాభాలు

IMG 20241114 WA0291

– వ్యూహం మార్చిన వైనం.

50 కేజీల మూటలతో తరలింపు.

భయం లేని మాఫియా.

అయితే ఏంటి.?

అంతా మాకు తెలుసు అంటున్న మాఫియా.

భద్రాచలం కేంద్రంగా సరిహద్దు రాష్ట్రాలకి చౌక ధరల బియ్యం పోతున్నాయి.దీనిపై అధికారుల చర్యలు శూన్యం. కొందరు చౌక దుకాణదారులు వినియోగదారులకు కిలో రూపాయలు 10 చెల్లిస్తూ వారిని వద్ద నుంచి నేరుగా తీసుకొని దళారులకు 15, 16 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే కూర్చున్న చోట నుండి క్వింటాకు 500 రూపాయలతో పాటు ప్రభుత్వం ఇచ్చే కమిషన్ బస్తాల విక్రయానికి ఆధారంగా ఆదాయం సమకూరుతోంది. మరి కొంతమంది రేషన్ డీలర్లు దుకాణదారులను మభ్యపెట్టి బియ్యం బాగోలేదు అని చెప్పి నగదు ఇచ్చి పంపించేస్తున్నారు. మీరు కూర్చున్న దగ్గరనే బస్తాకు 500 సంపాదిస్తూ నెలకు సుమారు ఒక్కొక్క షాపు నుండి 100 క్వింటాల నుంచి 120 క్వింటాల వరకు బయటకు విక్రయిస్తే నెలకు 70, 80 వేలు సంపాదిస్తూ ఏడాదికి లక్షల గడిస్తున్నారు. వీరికి దళారులు అడ్వాన్స్ గా నెలకు ముందే 30,000 వేల నుండి 50 వేలు లక్ష వరకు ఇలా అడ్వాన్స్ చెల్లిస్తూ వాళ్ళు ఆటోలో తరలిస్తున్నారు. పేదల బియ్యాన్ని వీళ్ళు దర్జాగా అమ్ముకుంటూ అధికారులు అడిగితే మామూలు ఇస్తున్నాం అనే సమాధానం చెబుతున్నట్లు తెలుస్తుంది. స్టోర్ బియ్యం తినట్లేదు అందుకే దళారులు కొంటున్నారు మేము అమ్ముతున్నాము అనే అనే విధమైన నిర్లక్ష్య సమాధానం పెరిగింది. అడపాదడపా దాడులు చేస్తున్న సివిల్ సప్లై డిటీలు పూర్తి స్థాయిలో చెక్ పెట్టలేకపోతున్నారు.
ఒక భద్రాచలంలోనే 20 పైగా షాపులు వరకు ఉన్నాయి. నెలకు లక్షల్లో చేతులు మారుతున్నాయి. కూర్చున్న చోటనే వీరికి దర్జాగా వేలకు వేలు జీతం వచ్చినట్టు ధనం వస్తోంది. ఇందులో బినామీలు చాలామంది ఉన్నారు. దళారీలు ఆటోలు కొనుగోలు చేసి ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్న దళారులకు సుమారు 22 రూపాయలకు విక్రయిస్తున్నారు. వారు వారి అవకాశాన్ని బట్టి రీసైకిలింగ్ మిల్లర్లకు లేదా ఒరిస్సా ఛత్తీస్ ఘడ్ దళారులకు 25 నుంచి 30 రూపాయలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. భద్రాచలం మన్యం కేంద్రంలో దీనిపై ఎవరూ నిఘా పెట్టడం లేదు. సివిల్ సప్లై అధికారులు లేకపోవడం ఇక్కడ ఒకింత వారికి అడ్డగా మారింది. ఇటీవల నిఘా పెట్టి ఆటోని పట్టుకోగా రెండు క్వింటాల బియ్యం దొరికాయి.
దీనిపై రూటు మార్చిన దుకాణదారులు వినియోగదారుల వద్ద కొనుగోలు చేసి అ బియ్యాన్ని తమ అనుచరుల ద్వారా 50 కేజీల మూటలు చొప్పున ఆంధ్రాలోని తమ సరుకు మోటార్ సైకిల్ పై గోడౌన్ తరలిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన వారు కొత్తగూడెం నుండి వచ్చే వరకు మూట కట్టుకుని సరిహద్దులు దాటిస్తున్నారు. నిఘా పెట్టకపోవడం వలన పేదప్రజల బియ్యం అక్రమార్కుల పాలవుతున్నాయి.
జిల్లా కలెక్టర్  ఇతర ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం పరిపాటిగా మారిందనే చెప్పాలి. మరలా అదే పునరావృతం అవుతుందో, అక్రమ బియ్యం మాఫియా వ్యక్తులపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Exit mobile version