ఐదో తరగతి ప్రవేశానికి 80 నుండి 120 వరకు సీట్లు పెంచాలని అలాగే ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేయాలని పాలకులకు విన్నపం

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమం పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి 80 నుండి 120 వరకు సీట్లు పెంచాలని అలాగే ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేయాలని పాలకులకు విన్నపం

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 26 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 8 గిరిజన మండలాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలుర గురుకులం పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి సీట్లు చాలక గిరిజన విద్యార్థులు చాలా బాధపడే పరిస్థితి ఉంది

కొమరాడ మండల కేంద్రంలో ఉన్న బాలుర గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశానికి సీట్లు ఇచ్చే అప్గ్రేడ్ చేస్తామని గతంలో అధికారులు చెప్పినప్పుడు కూడా ఆ దిశగా ఇంటర్మీడియట్ ఇక్కడ నేటికీ ప్రారంభించిన పరిస్థితి

కాళీ బిల్డింగులు అలాగే వసతి ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేయకపోవడం టెన్త్ పాసైన గిరిజన విద్యార్థులు కి చాలా అన్యాయం జరిగే పరిస్థితి

వెంటనే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి  మరియు కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి  వెంటనే స్పందించి కొమరాడ మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులం పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశానికి గాను 80 సీట్లు నుండి 120 సీట్లకు పెంచాలని అలాగే వసతి ఉన్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అప్గ్రేట్ చేయకపోవడం చాలా అన్యాయమని కాబట్టి వెంటనే ఈ సమస్యలు అటు మంత్రి ఇటు ఎమ్మెల్యే  ఈ సీజన్లో పరిష్కారం చేయాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో బుధవారం సిపిఎం పార్టీ మరియు గిరిజన సంఘం ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘము నాయకులు రామారావు మాట్లాడుతూ పార్వతీపురం ఐటీడీఏ ఎనిమిది మండలాల పరిధిలో కొన్ని మండలాల్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలు ప్రారంభించడం జరిగిందని అయితే ఈ సందర్భంలో ఆయా గురుకులం పాఠశాలలో ప్రవేశానికి ఐదో తరగతి గాను 80 సీట్లే ఉండటం వల్ల ఇంకా మిగిలిన 5వ తరగతి ప్రవేశానికి సంబంధించిన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని కాబట్టి మిగతా మండలాలతో పాటు కొమరాడ మండలానికి సంబంధించి ఈ గురుకులం పాఠశాలలో ఇప్పుడున్న 80 చీట్లు కన్నా అదనంగా మరొక 40 సీట్లు పెంచి 120 సీట్లు ఉంటే గిరిజన విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది అలాగే టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు కూడా ఇంటర్మీడియట్ చదివే విధంగా అప్గ్రేడ్ చేస్తే గిరిజన విద్యార్థులకు చాలా మేలు జరుగుతుందని కాబట్టి వెంటనే ఆ దిశగా మంత్రి మరియు ఎమ్మెల్యే  ఆలోచించాలని సిపిఎం పార్టీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో విన్నవించుకుంటున్నాము

Join WhatsApp

Join Now

Leave a Comment