*బదిలీల పారదర్శకతకు భరోసా ఇవ్వండి…!*
*గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్, బదిలీలు పారదర్శకంగా జరగాలి
*సిఫార్సు లేఖలకు అవకాశమివ్వరాదు*
*ప్రభుత్వ గైడ్లైన్స్ తూ.చా. తప్పకుండా పాటించాలి
పార్వతీపురం
*జిల్లా రెవెన్యూ అధికారుల కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 27( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్లైజేషన్, బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, నియోజకవర్గం చైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు, జిల్లా నాయకులు కోలా కిరణ్ కుమార్, పాలక రంజిత్ కుమార్ తదితరులు జిల్లా రెవెన్యూ అధికారి కే.హేమలతతో త్వరలో చేపట్టనున్న గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల రేసనాలైజేషన్, బదిలీలు విషయమై చర్చించి, వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ బదిలీలు నిర్వహించాలన్నారు. ఎందుకంటే నాయకుల సిఫార్సుల లేఖలతో రేషన్లైజేషన్, బదిలీలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు సిఫార్సు లేఖలకు నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. ఇదే అదనంగా కొంతమంది రాజకీయ దళారులు రంగ ప్రవేశం చేసి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. గత ఏడాది కూడా జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీలలో పలు అవకతవకలు చోటు చేసుకున్న విషయం తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. అలాగే విద్య, వైద్యం, అంగన్వాడి, రేషన్ డీలర్ల నియామకాలు సైతం జిల్లాలో పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న గ్రామ /వార్డు సచివాలయాల రేషన్లైజేషన్ బదిలీలపై ముందుగానే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. కాబట్టి ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం పారదర్శకంగా గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్లైజేషన్ బదిలీలు నిర్వహించాలన్నారు. ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఉన్నవారు మంచి మంచి స్థలాలు దక్కించుకుంటే, రాజకీయ పలుకుబడి లేని వారు మోసపోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొని ఉందన్నారు. కాబట్టి జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషన్లైజేషన్, బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామని వారికి భరోసా కల్పించాలన్నారు.