Site icon PRASHNA AYUDHAM

జర్నలిస్టుల పిల్లల చదువుకు 50% రాయితీ కల్పించాలి. -ఎర్ర యాకన్న. 

IMG 20250617 WA2280

*జర్నలిస్టుల పిల్లల చదువుకు 50% రాయితీ కల్పించాలి.*

-ఎర్ర యాకన్న.

ప్రశ్న ఆయుధం జూన్ 17: కూకట్‌పల్లి ప్రతినిధి

మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ పిల్లలకు చదువులో 50% రాయితీ కల్పించాలని కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న అన్నారు. మంగళవారం రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని విద్య శాఖ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్ర యాకన్న మాట్లాడుతూ జిల్లాలో పనిచేసే జర్నలిస్టులందరికి ఎలాంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని, కావున జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో చదువు కొరకు 50% రాయితీ కల్పించాలని ఆమెను కోరారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్, జాయింట్ సెక్రెటరీలు నాగుల అంజిబాబు, సుజాత, సభ్యులు శైలజ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version