Site icon PRASHNA AYUDHAM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రైతు భరోసా: ₹23.49 కోట్లు విడుదల

IMG 20250625 WA2289

*మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రైతు భరోసా: ₹23.49 కోట్లు విడుదల*

*24,978 మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 25

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 24,978 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా పథకం కింద ₹23.49 కోట్లు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తెలిపారు. బుధవారం నాటికి ఈ నిధులు రైతులకు చేరాయని, “రైతుల ముఖాల్లో సంతోషం చూడటమే ప్రభుత్వ ధ్యేయం” అని ఆయన పేర్కొన్నారు.

వానాకాలం సాగు ప్రారంభానికి ముందే ఈ నిధులు జమ చేయడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు రైతు భరోసా పథకం ఎంతో ఉపయుక్తమని ఆయన అభిప్రాయపడ్డారు.

రైతు భరోసా నిధులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని, యాసంగి కంటే ముందే నిధులు మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలపై రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version