టీజీవీపీ ఆర్గనైజేషన్ నుండి అల్లూరిని తొలగింపు
టీజీవీబీ జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్,
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 23
టీజీవీపి ఆర్గనైజేషన్ పనిచేస్తున్న లింగంపేట్ మండలానికి చెందిన అల్లూరిని టీజీవీపి ఆర్గనైజేషన్ నుండి అతని తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూగతంలో టీజీవీబీ ఆర్గనైజేషన్ లో పని చేసి ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీలో తిరుగుతున్న అల్లూరి లింగంపేట్ మండలనికి చెందిన వ్యక్తి అల్లూరి అనే వ్యక్తి అతనికి ఎటువంటి విద్యార్హత లేకపోయినా, రాష్ట్ర కార్యవర్గం ఎటువంటి బాధ్యత ఇవ్వకుండా గత కొంతకాలంగా సంఘానికి దూరం పెట్టిన కేవలం అతని వ్యక్తిగత జల్సాల కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలను టీజీవీబీ ఆర్గనైజేషన్ పేరుతో బెదిరిస్తూ,భయబ్రాంతులకు గురి చేస్తుట్లు తమ దృష్టికి వచ్చింది అని తెలిపారు.రాష్ట్ర కార్యవర్గం సూచన మేరకు అతనిని టీజీవిపి నుండి బహిష్కరిస్తున్నాం అని ఈ పత్రిక సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.ఈ మేరకు రాష్ట్ర శాఖ లేటర్ హెడ్ తో బహిష్కరణ లేఖను ప్రైవేట్,ప్రభుత్వ, మీడియా సంస్థలకు అందిస్తున్నాము అని తెలిపారు. ఇక ముందు తెలంగాణ విద్యార్థి పరిషత్ పేరు చెప్పి అల్లూరి అనే వ్యక్తి గానీ లేదా అతని అనుచరులు గానీ ఎటు వంటి కార్యక్రమాలు చేసినా, ప్రైవేట్ యాజమాన్యాలను ఇబ్బందులకు గురి చేసిన, ఆర్గానేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసిన సంఘం చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటుందని కామారెడ్డి జిల్లా ఇంచార్జి అనిరుధ్ రాజు, ఆదేశాల మేరకు తెలియజేస్తున్నాం అన్నారు. సంఘానికి మద్దతుని ఇస్తూ సంఘం పట్ల మర్యాద ఉన్న పూర్వ కార్యకర్తలను గౌరవిస్తాం అని సంజయ్ తెలిపారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కమిటీలను ప్రకటించి విద్యారంగ సమస్యలపై తమ దైన శైలిలో పోరాటం చేస్తాం అని తెలిపారు. సంఘానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరిని ఇబ్బంది పెట్టిన మమ్మల్ని సంప్రదించాలని తెలిపారు.
నూతన కమిటీ ఏర్పాటు
తెలంగాణ విద్యార్థి పరిషత్ నూతన కమిటీని తేదీ 22/1/2025 రోజున రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బట్టు శ్రీహరి, రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ శివరాత్రి, ఉపాధ్యక్ష,కార్యదర్శులు భాను చందర్, వంశీ నాయక్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఇంచార్జి గా అనిరుధ్ రాజు ను, జిల్లా అధ్యక్షుడిగా నన్ను ( గంధం సంజయ్ ) నియమించారని తెలిపారు.