*చల్లంగా చూడు రేణుక ఎల్లమ్మ తల్లి*
*తాటి వనంలో సామూహిక వనభోజనాలు*
*జమ్మికుంట జూన్ 27 ప్రశ్న ఆయుధం*
చల్లంగా చూడు రేణుక ఎల్లమ్మ తల్లి అని జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామ గౌడ కుల బాంధవులు రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు. జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలోని తాటి వనంలో గల రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని గౌడ కులస్తులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించారు. గ్రామంలోని గౌడ కుల బాంధవులు అందరూ కలిసి కుటుంబ సమేతంగా తాటి వనంలో సామూహిక వనభోజనాలు నిర్వహించారు.గౌడ కుల బాంధవుల పైన అమ్మవార్ల దీవెనలు ఉండాలని గౌడ కులస్తుల ఇలవేల్పు కులదైవం అయిన రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.