Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కలిసిన సింహ వాహిని ఫౌండేషన్ ప్రతినిధులు

IMG 20250617 212820

Oplus_0

సంగారెడ్డి/పటాన్ చెరు, జూన్ 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సోమవారం సింహ వాహిని ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గతంలో నిర్వహించిన సామాజిక సేవల కార్యక్రమాలను వివరించారు. సేవలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రారంభించబోయే “పిల్లలపై లైంగిక దుర్వినియోగ అవగాహన కార్యక్రమం” గురించి వివరించారు. దీనికి ఎమ్మెల్యే పూర్తిగా మద్దతు ఇచ్చారు. పిల్లల భద్రతకు అవసరమైన ఈ విధమైన చర్యలకు ప్రభుత్వం తరపున తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రోత్సాహంతో మా సేవలు మరింత విస్తృతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇది మాకు వచ్చిన నమ్మకాన్ని, బాధ్యతను పెంచిందని తెలిపారు.

Exit mobile version