శిశు రక్ష తిరుమల చిల్డ్రన్ స్పెషలిస్ట్ హస్పటల్ వద్ద గణతంత్ర దినోత్సవం

సంగారెడ్డి, జనవరి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ బైపాస్ లో గల శిశురక్ష తిరుమల చిల్డ్రన్ స్పెషలిస్ట్ హస్పటల్ లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని డాక్టర్లు, రాజ్ కుమార్, సిల్వేరి విష్ణువర్ధన్ రెడ్డి, శివకుమార్, వికాస్ కోహ్లీ, పాండు, నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాడు శిశురక్ష తిరుమల చిల్డ్రన్ స్పెషలిస్ట్ హస్పటల్ వద్ద గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, నర్సులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now