కందిలో కల్లు దుకాణం తీసేయాలని ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్రకు వినతి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31(ప్రశ్న ఆయుధం న్యూస్): కంది గ్రామంలోని కల్లు దుకాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంగారెడ్డి జిల్లా మద్య నిషేధ మరియు మద్యపాన అధికారి కార్యాలయంలో సూపరిండెంట్ నవీన్ చంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలోని శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్న కల్లు దుకాణం రాత్రి 11–12 గంటల వరకు నడపడంతో, ఆ ప్రాంతంలో మద్యం సేవించే వ్యక్తులు అనుచిత ప్రవర్తనకు దిగుతున్నారని అన్నారు. మూత్ర విసర్జన చేయడం, బస్తీ ఇళ్ల ముందు ఖాళీ పాకెట్లు వేయడం, చిన్న పిల్లలు, మహిళలపై వేధింపులు వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జ్వరాలు, అనారోగ్య సమస్యలు పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్న కల్లు దుకాణం చిన్నపిల్లల రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని, గణపతి చౌక్ మధ్యలో ఉన్న ఈ దుకాణాన్ని వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment