హనుమాన్, వినాయకుని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని ఎస్పీకి వినతి

IMG 20241016 193044
సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలో హనుమాన్ మందిరంలో హనుమాన్ విగ్రహాన్ని మరియు వినాయకుని విగ్రహాలు ధ్వంసం చేయడాని నిరసిస్తూ వీహెచ్ పీ, బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ రూపేష్ కు వినతి పత్రం అందజేశారు. సదాశివపేట పట్టణంలో హనుమాన్ మందిరంలో గల వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు కలిసి నిరసన తెలుపుతూ సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రూపేష్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత వారం రోజులుగా హిందూ దేవాలయాల పైన హిందూ దేవి దేవతల విగ్రహాల పైన దాడులు జరుగుతున్నాయని, మొన్న హైదరాబాదులో రెండు సంఘటనలు మరియు బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఒక సంఘటన జరిగిందని ఉద్దేశపూర్వకంగానే హిందువులను రెచ్చగొట్టే విధంగా దేవీ దేవతలను అవమానపరుస్తూ విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్న వారిని వెంటనే శిక్షించాలని, సదాశివపేటలో జరిగిన దుశ్చర్యను పోలీసులు దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
IMG 20241016 193056
బీజేపీ రాష్ట్ర నాయకుడు రాజేశ్వరరావు దేశ్ పాండే మాట్లాడుతూ.. సదాశివపేటలో జరిగిన సంఘటన యావత్ హిందూ సమాజానికి అవమానకరమైన సంఘటన అని, హిందువులందరూ దసరా పండుగ వాతావరణంలో సంతోషంగా ఉన్న హిందువులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పవన్ గౌడ్ మాట్లాడుతూ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, లేని ఎడల 24 గంటల తర్వాత పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని, రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ సదాశివపేటకు తరలి రావాలని హిందూ సంఘాలకు హిందువులకు అందరికీ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మాణిక్ రావ్, మల్లేశం, ద్వారకా రవి, శ్రీనివాస్, హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now