మహిళా దినోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి (మార్చి 08)
దమ్మపేట జడ్పీహెచ్ హై స్కూల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యురాలు ఏసు మణి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి .ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మహిళలను ఉద్దేశించి మహిళలు శక్తివంతులని, మహిళా సాధికారత కొరకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మహిళలకు ప్రత్యేక పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తున్నామని. అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని.వారిని ప్రోత్సాహపరిచారు. దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మహిళలను ఉద్దేశించి చరిత్రలో మహిళలు చిరస్థాయిగా నిలిచిపోయిన వారు చాలామంది ఉన్నారని ఝాన్సీ లక్ష్మీబాయి, మదర్ తెరిసా, చాకలి ఐలమ్మ లాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని తెలిపారు. దిశా కమిటీ సభ్యురాలు యేసు మణి మాట్లాడుతూ మహిళలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని మహిళలకు ప్రభుత్వంలో స్థానం కల్పించారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నియోజకవర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారని మహిళలందరూ ధైర్యముగా అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో దమ్మపేట మర్కెట్ యాడ్ చైర్మన్ వాసం రాణి, కొమరం రత్తమ్మ, హెల్త్ సూపర్వైజర్, గ్రామ దీపికలు, మహిళా కమిటీ సభ్యులు, పర్వతనేని ప్రసాద్, ముల్లపూడి వెంకటేశ్వరరావు, పగడాల రాంబాబు, చిన్నంశెట్టి యుగంధర్