*జూన్ మొదటి వారంలోనే రేవంత్ రెడ్డి,మంత్రివర్గ విస్తరణ?*
హైదరాబాద్:మే 31
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైం ది. జూన్ తొలి వారంలో విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో పలువురు కొత్త నేతలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరపనున్నారు. ఈ విస్తరణ ద్వారా పాలనా వ్యవహారాల్లో మరింత సమర్థతను తీసుకురావా లని, అలాగే పార్టీలో సమ తూకాన్ని సాధించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సామాజిక వర్గాలవారీగా విశ్లేషణ రాష్ట్ర మంత్రివర్గం లో స్థానం పొందే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే తీసుకొనేది నలుగురినా లేక ఐదుగురినా? అనే అంశంపై స్పష్టత రాలేదు. గతంలో గుర్తించిన పేర్లపై మరోమా రు చర్చించారు.
ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనా యక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్రావు, గడ్డం వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆదిశ్రీనివాస్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ల పేర్లు ఉన్నాయి.
కొత్త మంత్రుల ఎంపికలో అనేక అంశాలను పరిగణన లోకి తీసుకోనున్నారు. సామాజిక సమీకరణాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం వంటి అంశాలుప్రాధాన్య తను,సంతరించుకోనున్నా యి.
అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా, అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా జాబితాను రూపొందించే అవకాశం ఉంది.పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అనం తరం.. ఏ క్షణమైనా కొత్త మంత్రులను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఈసారి తెలంగాణ క్యాబి నెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అలాగే ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిని ఎన్నికల సమయంలోనే పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అనే హామీతో కాంగ్రెస్లో చేర్చుకున్నారు.
ఈ నేపథ్యంలో, వారికి పదవులు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.