Site icon PRASHNA AYUDHAM

కెసిఆర్ బాటలోనే రేవంత్ సర్కార్

IMG 20241110 WA0145

పొనిశెట్టి వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయం లో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు గత ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా సకల జనుల సర్వే చేసిన విధంగా ఇప్పడి రేవంత్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే ఉందని అన్నారు.ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కండువాలు వేసుకొని సర్వే అధికారులతో ప్రజల వద్దకు వెళ్లడం చట్ట వ్యతిరేకం అని అన్నారు.ఈ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే లో ఆర్థిక, సామాజిక, విద్య ,ఉపాధి,కుల సర్వే తో పాటు రాజకీయ సర్వే కూడ చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజల జీవితాలు మెరుగుపడటానికి సంక్షేమ పథకాల కోసం సర్వే చెయ్యాలి కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రాజకీయ పార్టీ లో ఉన్నారు కనుక్కునే ప్రక్రియ నడుస్తుంది అని అన్నారు. సర్వే చేసే అధికారులు ప్రజలను మీరు ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఏ రాజకీయ పార్టీ నుండి గతం లో పోటీ చేసినారు అని అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గా సర్పంచి ఎంపీటీసీ గా వివిధ పదవులకు పోటీ చేసినార అని అడుగుతున్నారు అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేసే సమగ్ర కుటుంబ సర్వే కేవలం ప్రతి పక్షాల పట్ల ప్రజల తీరు తెలుసుకోవడానికి చేస్తున్నట్లు ఉంది అని అన్నారు ఇప్పడికైనా పాలన వేరు పార్టీ వేరు అనేది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే బాగుంటుంది అన్నారు ఈ కార్యక్రమం లో గొడుగు శ్రీధర్(కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు),మాలోత్ గాంధీ (లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు),గుగులోత్ శంకర్ (ములకలపల్లి మండల అధ్యక్షులు),లక్కాకుల ప్రశాంత్ (దమ్మపేట మండల అధ్యక్షులు) కల్పన తదితరులు పాల్గొన్నారు

Exit mobile version