స్మశాన వాటిక ప్రభుత్వ భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు

*స్మశాన వాటిక ప్రభుత్వ భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు*

*జమ్మికుంట జూన్ 21 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 431లో 6 ఎకరాల 30 గుంటల భూమి ఉండగా ఇందులో కొందరు రాజకీయ ముసుగులో ప్రభుత్వ భూమిని భూకబ్జా చేసి అక్రమ లేఅవుట్ ప్లాట్స్ చేసి విక్రయాలు చేస్తున్నారని విచారణ జరిపి ప్రభుత్వ భూమిని భూకబ్జా దారుల నుండి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న సంబంధిత స్థానిక అధికారులకు, ఉన్నతాధికారులకు పిర్యాదు చేయగా స్పందించిన రెవెన్యూ అధికారులు శనివారం జమ్మికుంట తహశీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యానారాయణ, సర్వేయర్ మనోజ్ రావు స్థల పరిశీలన చేశారు. వారం రోజుల లోపు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 431 లో ఎకరాలు 6:30 గుంటల భూమిని సర్వే చేసి నివేదికను తహశీల్దార్, పై ఉన్నతాధికారులకు సర్వే కాపీ నివేదికను సమర్పిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ మాజీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న,కాంగ్రెస్ మైనారిటీ నాయకులు ఎండి సలీంపాష, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment