రోడ్డు భద్రత మనందరి బాధ్యత జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి

రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు లో భాగంగా శుక్రవారం రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుండి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలను ఏటా నిర్వహించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు విధిగా ధరించాలని, ఇన్సూరెన్స్,డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను తీసుకెళ్లాలని చెప్పారు. వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించడం సెల్ఫోన్ లో మాట్లాడటం నిద్రలేమి వంటి కారణాలతో డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలకు గురి అవుతున్నారని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదని ఆయన చెప్పారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో విధిగా హెల్మెట్ ధరించాలని దాని ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా హెల్మెట్ కాపాడుతుందని కలెక్టర్ అన్నారు. ఈ ర్యాలీలో రవాణా మరియు పోలీస్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రకాశం స్టేడియం నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా ముర్రేడు వాగు బ్రిడ్జి వద్ద నుండి తిరిగి రైల్వే స్టేషన్ వరకు కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి వెంకటరమణ, సిక్స్త్ బెటాలియన్ సీఐ బ్రహ్మం,మోటార్ వెహికల్ అధికారులు మనోహర్, భీమ్ సింగ్, వెంకట పుల్లయ్య, ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now