మధిర మున్సిపాలిటీలోని అద్వానంగా మారిన రోడ్లు..

మధిర మున్సిపాలిటీలోని అద్వానంగా మారిన రోడ్లు..

మధిర మున్సిపాలిటీలోని బురదమయమైన రోడ్ల వల్ల ఎవరికైనా ప్రాణాపాయస్థితి ఏర్పడినప్పుడు కనీసం అంబులెన్స్ పోయే అవకాశం లేదు.

మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సోమవరపు నరసింహారావు అనే ఉపాధ్యాయునికి హార్ట్ ఎటాక్ రావడం తో అంబులెన్స్ కు కాల్ చేస్తే ఆ రోడ్ల గుండా అంబులెన్స్ పోయే పరిస్థితి లేకపోవడంతో అతనిని అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చే వరకు 20 నిమిషాల సమయం పట్టింది ఈ లోపే ప్రాణాలు కోల్పోయాడు..

వర్షాకాలం మొదలైన సమయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తీస్తున్న గుంతలు దానివల్ల మట్టి మధిర మున్సిపాలిటీలోని ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది..

ఒకవైపుఅభివృద్ధి కార్యక్రమం మరొకవైపు బురదమయమైన రోడ్లతో ప్రజల సమస్య మరి పరిష్కారం ఏమిటో?

Join WhatsApp

Join Now

Leave a Comment