గజ్వేల్ లో రోటరీ క్లబ్ సేవలు విస్తరించాలి
రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ నరసింహ యాదవ్.
గజ్వేల్ అక్టోబర్ 10 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ పరిధిలో అన్ని గ్రామాలలో రోటరీ క్లబ్ సేవలు అందించాలని రోట్ క్లబ్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ నరసింహ యాదవ్ అన్నారు.గురువారం గజ్వేల్ లో రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ సెంట్రల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పేద ప్రజలకు కావలసిన చిన్న చిన్న అవసరాలను తీర్చడానికి రోటరీ క్లబ్ ముందుండాలన్నారు. ప్రస్తుతం గ్రామాల్లోని చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందించనున్నమన్నారు అలాగే పాఠశాల విద్యార్థులకు కాలినడకన నడుచుకుంటున్న పోతున్న సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థుల కోసం సైకిల్లు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రోటరీ సేవలు ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నప్పటికీ గ్రామాలలో కింది స్థాయికి చేరడం లేదన్నారు. స్థానిక రోటే క్లబ్ నాయకులు కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజలకు కావలసిన అవసరాలను దృష్టిలో ఉంచుకొని తమ తమ సేవలను అందించినప్పుడే రోటరీ క్లబ్ కు మంచి పేరు వస్తుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇక్కడి సేవలను తెలుసుకున్న ఆయన ఇక్కడి రోటరీ నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సెంట్రల్ రోటరీ క్లబ్ ఆఫ్. అధ్యక్షులు తుమ్మ కృష్ణ. క్లబ్ సీనియర్ నాయకులు. వివి రమణ, శ్రీనివాస్,మల్లేశం, హరికృష్ణ, శివ.తదితరులు పాల్గొన్నారు.