**నాగారం బీఎంఆర్ కాలనీలో రూ. 9.90 కోట్ల బాక్స్ డ్రైనేజీ పనులు ప్రారంభం – ఎంపీ ఈటల పరిశీలన**
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 17
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని బీఎంఆర్ కాలనీలో హెచ్ఎండిఏ నిధులతో రూ. 9 కోట్లు 90 లక్షల విలువైన బాక్స్ డ్రైనేజీ పనులు మంజూరయ్యాయి. ఈ పనుల మంజూరులో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
మంగళవారం ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా బీఎంఆర్ కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. పనుల నాణ్యతను, పురోగతిని సమీక్షించి అధికారులను తగిన సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్తో పాటు మాజీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక నాయకులు అన్నంరాజు సురేష్, నక్క కిషోర్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాయకులు మాట్లాడుతూ, “ఈ బాక్స్ డ్రైనేజీ పనులు పూర్తయిన అనంతరం బీఎంఆర్ కాలనీలో వర్షాకాలంలో ఎదురయ్యే ముంపు సమస్యలు పరిష్కారం కానున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది” అని పేర్కొన్నారు.ప్రాజెక్టు పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేసి కాలనీవాసులకు మేలు చేకూర్చాలని ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు.