అదుపుతప్పి లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు..
వైయస్సార్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీ ఆర్టీసీ బస్సు 30 అడుగుల లోయలో పడిపోయింది, ఈ ఘటన కడప జిల్లాలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం. కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులంతా ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా,ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రు లను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
అదుపుతప్పి లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు..
by kana bai
Updated On: October 23, 2024 3:21 pm