సంగారెడ్డి ప్రతినిధి, జూలై 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆర్టీసీ సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్ యాదవ రెడ్డిని ఆర్టీసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పురుషోత్తం నాయక్ సన్మానించారు. మంగళవారం సంగారెడ్డి డిపోలో టీజీ ఆర్టీసీ త్రైమాసిక ప్రగతి చక్ర అవార్డులో భాగంగా ఇంధన పొదుపు చేసిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన డ్రైవర్ యాదవరెడ్డిని హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ పురస్కారాన్ని అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎం ఉపేందర్, గజ్వేల్ డీఎం పవన్, మెదక్ డీఎం సురేఖ, ఆర్ఎం ప్రభులత, డిప్యూటీ ఆర్ఎం దేవదానం తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ డ్రైవర్ యాదవరెడ్డిని సన్మానించిన ఈడీ పురుషోత్తం నాయక్
Oplus_0