సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ – 2కే రన్”

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రియ ఏకతా దివాస్ (రాష్ట్ర ఐక్యతా దినోత్సవం), సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ – 2కే రన్” ను ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. శుక్రవారం రాష్ట్రియ ఏకతా దివస్ (రాష్ట్ర ఐక్యతా దినోత్సవం), సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు ‘రన్ ఫర్ యూనిటీ” 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 31ని రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా పిలుస్తామని అన్నారు. వల్లభాయ్ పటేల్ పోరాట పఠిమ ద్వారా భారత దేశ చరిత్రలోనే ప్రఖ్యాత వ్యక్తిగా గుర్తింపు పొందారని అన్నారు. వల్లభాయ్ పటేల్ రాష్ట్ర ఐక్యతకు చేసిన కృషి, నాయకత్వ లక్షణాలను మెచ్చి మహాత్మా గాంధీ ఆయనకు “సర్ధార్” బిరుదును ఇచ్చారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తో మన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అనుబంధం వుందని, 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ తెలంగాణ రాష్ట్రం నిజాం నిరంకుశ పాలనలో ఉండేదని, సర్ధార్ వల్లభాయ్ పటేల్ పోరాట పఠిమతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సంస్థానం భారత దేశంలో విలీనం కావడం జరిగిందని అన్నారు. వందలాది సంస్థానాలను ఒక్కటి చేసిన మహనీయుడికి ఘననివాళులు అర్పిస్తూ.., జాతీసమైక్యతకు పునరంకితమై మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధులు, వివిధ సంస్థానాలుగా ఉన్న భారత దేశాన్ని ఒక్కతాటిపై తీసుకువచ్చి రాష్ట్ర ఐక్యతకు పాటుపడిన గొప్ప నాయకుడనీ, ఉక్కు మనిషిగా పిలవబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్ధం గుజరాత్ లోని నర్మదా నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతైన 182 మీటర్ల విగ్రహాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఆయన జయంతి/రాష్ట్రియ ఏకతా దివాస్ ను పురస్కరించుకొని జిల్లా పోలీసు శాఖ ఆద్వర్యంలో ఈ ‘రన్ ఫర్ యూనిటీ” 2కే రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ 2కే రన్ లో సంగారెడ్డి పట్టణంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రన్ ను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్, డానియోల్, యువజన సంఘాల నాయకుడు కూన వేణు, సిబ్బంది మరియు వివిహ పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment