గ్రామీణ వైద్యులపై ఐఎంసీ దాడులను ఆపాలని ఎంపీకి వినతి

వైద్యులపై
Headlines
  1. “గ్రామీణ వైద్యుల సంక్షేమం కోసం ఎంపీ రఘురాంరెడ్డికి వినతి”
  2. “గ్రామీణ వైద్యులపై ఐఎంసీ దాడులను ఆపాలని ఎంపీ విన్నపం”
  3. “ఆర్ఎంపీ డాక్టర్లపై కేసులను ఎత్తివేయాలని గ్రామీణ వైద్యుల సూచన”
  4. “కేసులు ఎత్తివేసి, గ్రామీణ వైద్యులకు న్యాయం చేయాలని ఎంపీ రఘురాంరెడ్డి హామీ”
  5. “ఖమ్మం ఎంపీ కార్యాలయంలో వైద్యుల సమస్యలు: ఐఎంసీ తో చర్చించనున్న ఎంపీ”
ఆర్ఎంపీలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీకి విన్నపం

ఖమ్మం నవంబర్24: ఇటీవల ఐఎం సి కి చెందిన టీం సభ్యులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాథమిక వైద్యం చేస్తున్న కొందరు ఆర్ఎంపీ డాక్టర్ లపై పెట్టిన కేసులను ఎత్తివేసే విధంగా ఐఎంసీ డాక్టర్ల బృందం సభ్యులకు సూచించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డికి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు విన్నవించారు.ఆదివారం ఖమ్మం ఎంపీ కార్యాలయంలో

పార్లమెంటు సభ్యులు రామసాయం రఘురాంరెడ్డిని

గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు నారపోగు సుదర్శన్ తో కలిసి ప్రస్తుతం సమాజంలో గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తిస్థాయిలో వివరించారు. గ్రామాలలో గ్రామీణ వైద్యులు స్వేచ్ఛగా ప్రాథమిక వైద్యం చేసుకునేందుకు ఎంపీ రఘురాంరెడ్డి రాష్ట్రంలోని

ఐఎంసీ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరించవలసిందిగా సూచించారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ రఘురాంరెడ్డి ప్రభుత్వంతోపాటు ఐఎం సి డాక్టర్ల బృందంతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం అధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా ఎంపీ రఘురాంరెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

Join WhatsApp

Join Now