మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా..! సబీహా గౌసుద్దీన్
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 05: కూకట్పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ అన్నారు. స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేటర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు కార్పొరేటర్ దృష్టికి మంచినీటి సప్లై కొరత ఉందని, మంచినీరు కలుషితమవుతుందని, సీసీ రోడ్డు, విద్యుత్ దీపాల సమస్యలు స్థానికులు తెలియపరిచారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి మంచినీటి కలుషితం, మరియు నీటి సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కార్పొరేటర్ జలమండలి మేనేజర్ అన్వేత్ కి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జహీద్ షరీఫ్ బాబా, టిఆర్ఎస్ రాజు, బద్రి నాయక్, బ్రహ్మ, కళ్యాణ్ నాయక్, శ్రీనివాస్ యాదవ్, అప్పన్న, శంకర్, కొండయ్య, సైదమ్మ, తదితరులు పాల్గొన్నారు.