తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ సూచన మేరకు సద్దుల బతుకమ్మ పండగ సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు, బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. బతుకమ్మ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతు మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియ సందడి చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఇంట్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటారన్నారు. బొడ్డెమ్మతో మొదలుకొని ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే ఉందన్నారు.
తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా రంగు రంగుల పూలతో ప్రతి అడపడుచు ముందుంటున్నారు. వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.