Site icon PRASHNA AYUDHAM

పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

IMG 20250324 WA0071

పార్లమెంటు సభ్యుల జీతాలు పెంపు

పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్,పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం లక్ష రూపాయలుగా ఉంది. దాన్ని ఏకంగా లక్షా 24 వేలకు పెంచింది.

డైలీ అలవెన్సెస్‌ను 2వేల నుంచి 2,500లకు పెంచింది.

పెన్షన్ విషయానికి వస్తే.. మాజీ సభ్యులకు ప్రతీ నెల 25 వేల పెన్షన్ అందుతోంది. దాన్ని 25 వేల నుంచి 31 వేలకు పెంచింది.

మాజీ సభ్యుల అదనపు పెన్షన్‌ 2 వేల నుంచి 2,500లకు పెంచింది.

ఈ పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి అమలు అవుతుంది.

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను పెంచింది. ముఖ్యమంత్రి నెల జీతం లక్ష ఉంటే.. పెంచిన జీతం ప్రకారం 2 లక్షలు అవుతుంది.

Exit mobile version