త్రివిధ దళాల విరోచిత పోరాటానికి సెల్యూట్

*త్రివిధ దళాల విరోచిత పోరాటానికి సెల్యూట్*

*ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వర రావు

దేశం కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్న త్రివిధ దళాలకు కురుపాం నియోజకవర్గ ప్రజల తరఫున సెల్యూట్ చేస్తున్నామని ప్రభుత్వ విప్ మరియు కురుపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు *తోయక జగదీశ్వరి* అన్నారు. దేశానికి ఆపద వస్తే మేమున్నామంటూ రక్షణ కల్పిస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు పాదాభివందనం చేస్తున్నామన్నారు. క్లిష్ట పరిస్థితులలో శత్రువులకు దీటుగా ఎదురు నిలబడి సమాధానమిస్తున్న సైనికులకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిస్తూ, ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, నాయకులు మరడాన తవిటి నాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment