ఈనెల 22వ తేదీ నుంచి సంగారెడ్డి ఇర్ఫాని దర్గా ఉత్సవాలు

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ శివారులోని ఇర్ఫాని దర్గా ఉత్సవాలు ఈనెల 22నుంచి ప్రారంభించనున్నట్లు పీఠాధిపతి అహ్మద్ ఉమర్ బీన్ తెలిపారు. శనివారం దర్గా ఉత్సవాలకు సంబంధిoచిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22న గంధరాధన, కవి సమ్మేళనం, 23న దీపారాధన కవాలి ఉంటుందని అన్నారు. కుల,మతాలకు అతీతగా ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now