Site icon PRASHNA AYUDHAM

ప్రధాని నరేంద్ర మోదీ నవోదయ పాఠశాల ప్రకటించడం హర్షనీయం: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి*

ప్రధాని

Oplus_131072

Headlines :
  1. సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల ప్రకటించిన ప్రధాని మోదీ
  2. బీజేపీ హామీలను నెరవేర్చిన రఘునందన్ రావు – గోదావరి అంజిరెడ్డి
  3. పఠాన్ చెరుకు మెట్రో రైలు – రాబోయే ప్రాజెక్టులు బీజేపీ లక్ష్యం
  4. కాంగ్రెస్ విద్యా అభివృద్ధి వాగ్దానం హాస్యాస్పదం: బీజేపీ

సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రధాని నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల ప్రకటించడం హర్షనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీగా రఘునందన్ రావు గెలవగానే ఇచ్చిన హామీలలో ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారని, ఇచ్చిన మాట ప్రకారం పటాన్ చెరు వరకు మెట్రో రైలు సాధించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీని ఒప్పించి సంగారెడ్డి జిల్లాకు నవోదయ పాఠశాల ఇప్పుడు ప్రకటించడం కూడా ఎంపీ రఘునందన్ రావు మరియు బీజేపీకి ఈ ప్రాంత విద్యార్థుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని తెలిపారు. అలాగే రాబోవు రోజుల్లో జహీరాబాద్ లో కూడా ఏకలవ్య పాఠశాల తీసుకురావడం కోసం బీజేపీ పార్టీ కృషి చేస్తోందని ఆమె అన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో సంగారెడ్డి మరియు పఠాన్ చేరు ప్రాంతాలు మాత్రమే ఉన్నప్పటికీ గెలిచిన సంవత్సర కాలంలోపే ఈ రెండు నియోజకవర్గాలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం సంతోషకరమని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం, సంవత్సర పాలన సంబరాలు చేస్తున్నారని అందులో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తం అనడం నిజంగా హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో వైఎస్ ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా ఉన్న దామోదర గారు ఈ ప్రాంతాన్ని ఏం అభివృద్ధి చేశారని అన్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో వైద్యా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దామోదర రాజనర్సింహ ఈ జిల్లాలో ఏం ఒరగబెట్టారని బీజేపీ జిల్లా శాఖ తరపున అడుగుతున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో విద్యా శాఖ మంత్రిని నియమించకపోవడం వారికి ఈ రాష్ట్రంలో విద్య పట్ల వున్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. అలాగే నిన్న దామోదర రాజనర్సింహ మీటింగ్ సందర్భంగా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టును బయటకు నెట్టివేయడం బీజేపీ సంగారెడ్డి జిల్లా శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఘటనలు బీజేపీ సహించదని, నిజాలను నిర్భయంగా చెప్పేందుకు జర్నలిస్టులు కృషి చేస్తారని, అలాంటిది వారిపై సాక్ష్యాత్తు మంత్రి పర్యటనలో దాడి జరగడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్, పట్టణ అధ్యక్షుడు ద్వారక రావి, జిల్లా యువ మోర్చ అధ్యక్షుడు ప్రవీణ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version